ప్రజాశక్తి-చిత్తూరు : వైసిపి పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఆదేశాల మేరకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ ఆర్.కె.ఎమ్.పురం గ్రామానికి చెందిన మారుసాని.జ్ఞానేంద్ర రెడ్డి ని చిత్తూరు జిల్లా వైయస్సార్సీపి యూత్ జనరల్ సెక్రటరీగా మించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మారసాని జ్ఞానేందర్ రెడ్డి ఆదివారం మీడియాతో రాబోవు ఎన్నికల్లో జీడి నెల్లూరు వైసిపి అభ్యర్థిని గెలిపించి తీరుతామని అలాగే జగనన్న పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగనన్న, సంక్షేమ పథకాలతోనే తిరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వైసిపి పార్టీకి ఎప్పటికి నేను రుణపడి ఉంటా అని తెలిపారు.
![chittoor youth secretary](https://prajasakti.com/wp-content/uploads/2024/01/chittoor-youth-secretary.jpg)