సదుంలో ఘనంగా పింఛన్ల పంపిణీ 

Jul 1,2024 14:17 #Chittoor District

ప్రజాశక్తి-సదుం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా పెంచిన పింఛన్లను మండల పరిధిలో సోమవారం తెలుగు దేశం పార్టీ నాయుకులు ఘనంగా ప్రారంభించారు. తాటిగుంటపాల్యేం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో యర్రగుంట్ల మహేష్ రెడ్డి, యర్రగుంట్ల వెంకట రమణా రెడ్డి, బోడుకూరి నారాయణ, రమణా రెడ్డి చంద్రబాబు నాయుడు ఫోటోకు పాలాభిషేకం చేశారు. అనంతరం పింఛన్లు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సదుం బస్టాండ్ కూడలి వద్ద తెలుగు దేశం నాయుకులు యర్రగుంట్ల శ్రీనివాసులు రెడ్డి,ఎం. కృష్ణయ్య, యర్రగుంట్ల ముని రెడ్డి,ఎం. వసంత్ కుమార్ కేకు ను కట్ చేశారు. అనంతరం తెలుగుదేశం నాయుకులు, అభిమానులు స్వీట్లు పంచుకొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్, దామోదర్ రెడ్డి, రామ చంద్రయ్య, గౌతమ్ రెడ్డి, తిరుమలేశు, అనిల్, అరవ పాలెం రత్న తదితర నాయుకులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

➡️