అవార్డు గ్రహీతలకు అభినందన సభ

Jan 30,2024 15:28 #challapalli, #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : చల్లపల్లి మండలంలోని వివిధ డిపార్ట్మెంట్‌లలో పనిచేస్తూ.. రిపబ్లిక్‌ డే వేడుకల్లో కలెక్టర్‌ నుండి ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను మహాత్మ జ్యోతిరావు పూలే అభిమాన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఘనంగా సన్మానించారు. చల్లపల్లి సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ సిహెచ్‌. నాగప్రసాద్‌,వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నల్లూరి వెంకట భార్గవ ,పంచాయితీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పేర్ని మాధవేంద్రరావు , చల్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ రైటర్‌ మొక్కల గడ్డ పవన్‌ కుమార్‌ పవనకుమార్‌, చల్లపల్లి పంచాయితీ కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ సంధ్య,ఆఫీస్‌ సబార్టీనేట్‌ రామలక్ష్మి లకు మాహాత్మా జ్యోతిరావు పూలే అభిమానసంఘ సభ్యులు అడ్డాడ ప్రసాద్‌,కైతేపల్లి దాస్‌,ఉప్పల సాంబశివరావు ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.అంబెద్కర్‌ అభిమాని దాసి సీతారామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ డిఎస్‌పి హరిరాజేంద్రప్రసాద్‌, చల్లపల్లి సర్పంచ్‌ కృష్ణకుమారి, ఉపసర్పంచ్‌ ముమ్మనేని నాని,వక్కలగడ్డ పిఎసిఎస్‌ అధ్యక్షుడు హనుమాన్ల సురేంద్రనాద్‌ బెనర్జీ, డిఆర్‌ఓ సీసీ తూము వెంకటేశ్వరరావు, అల్లూరి బాబూరావు, చెక్‌ పోస్ట్‌ వెంకటేశ్వరరావు, లంకా బోస్‌, వరిగంజి అర్జునరావు, మేరుగు రమేష్‌, ఇసాక్‌, వాసు, ఆదిశేషు, ఆనంద్‌, సచివాలయ, పంచాయితీ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

➡️