అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

పరిగి (అనంతపురం) : పరిగి మండలంలోని కాలువపల్లి శివాలయం సమీపంలోని మామిడితోపు వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళితే … నల్లూరుకు చెందిన నరసింహమూర్తి (46) నల్లూరు నుండి మహిళా కార్మికులను కాలువపల్లి నిషా డిజైన్స్‌ గార్మెంట్స్‌ కు ఆటోలో తరలించేవాడు. అయితే ఇదే గార్మెంట్స్‌ కు కిలోమీటర్‌ దూరంలో ఉన్న మామిడితోపు వద్ద అనుమానాస్పదస్థితిలో నరసింహమూర్తి మఅతి చెందడంపై పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలను విచారిస్తున్నారు.

➡️