ప్రజాశక్తి-రామచంద్రపురం (తిరుపతి) : రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటో తారీఖున సూపర్ సిక్స్ పథకాలలో పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి సోమవారం మండలంలోని 23 పంచాయతీలలో పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఆయా గ్రామాలలో సిఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి స్థానిక టిడిపి నాయకులు, పింఛన్ లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించి అనంతరం జూలై నెలకు సంబంధించి నాలుగు వేలు, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలను సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల సందర్భంగా సిఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులు సిఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పులివర్తి వెంకట మణి ప్రసాద్ సతీమణి, సుధా రెడ్డి, మాజీ ఎంపీపీ డి.బిందు మాధవి, ఎం.తిరుమలరెడ్డి, సి.జనార్దన్ చౌదరి, ఆరి లీల మోహన్ నాయుడు, పాలపర్తి బాబు యాదవ్, కే.నరసింహారెడ్డి, కోరా హరిప్రసాద్, బండి విజయ్ కుమార్, మధు రాయల్, వెంకటేష్ రెడ్డి, మొగిలి రెడ్డి పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/tirupati.jpg)