ప్రజాశక్తి -గోకవరం మండల కేంద్రమైన గోకవరంలో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం వెళ్లే మార్గంలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద గురువారం ఎస్పి పి.జగదీష్ పలు వాహనాలను స్వయంగా తనిఖీ చేశారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గోకవరం శివారున ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రతిక్షణం అలర్ట్గా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట గోకవరం ఎస్ఐ నాగరాజు, పోలీసులు ఉన్నారు.