ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్స్థానిక సుందరశ్రీ కళ్యాణ మండపంలో పిఒ, ఎపిఒ 2వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్కాంత్ సరోఛ్ మాట్లాడారు. ఎన్నికల విధులను నిబద్ధత కలిగి నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ రోజున పోలింగు ముగిసే సమయానికి ఎంతమంది ఓటర్లు లైన్లో ఉన్నారో, వారందరికీ లైన్లో చివరి వ్యక్తికి ఒకటో నెంబర్ ఇస్తూ అందరికీ నంబర్లతో కలిగిన స్లిప్స్ జారీ చేసి ఓటు హక్కును కల్పించాల్సి ఉందన్నారు. సాయంత్రం 6 గంటలకు లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు.