అంగన్వాడీ ఉద్యమంపై ఎస్మా ప్రయోగం సిగ్గుమాలిన చర్య

ప్రజాశక్తి మార్టూరు రూరల్(బాపట్ల జిల్లా) :న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 27 రోజులుగా సమ్మె బాట పట్టిన అంగన్వాడీల పై వైసిపి ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం సిగ్గుమాలిన చర్య అని టిడిపి మహిళా మండలి అధ్యక్షురాలు ఉప్పుటూరి రమాదేవి తీవ్రంగా విమర్శించారు.అంగన్వాడీ ఉద్యమం అణచివేత కోసమే తెచ్చిన జీవో నంబర్ 2 రద్దు చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో మార్టూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక జనసేన నాయకులతో కలిసి జీవో ప్రతులను దగ్ధం చేశారు. సంక్రాంతి లోగా ఎస్మా ప్రయోగం వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని బత్తుల హనుమంతరావు హెచ్చరించారు.

➡️