ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : గుడ్లవల్లేరులోని స్థానిక లయన్స్ సేవా భవనం వద్ద 120 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పసుమర్తి గాంధీ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు బర్రా నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పెరుమాళ్ళు, కార్యదర్శి చలసాని శ్రీధర్, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వై పి సి ప్రసాద్ , వల్లభనేని సుబ్బారావు చౌదరి , సూరపనేని పరంధామయ్య , మరియు ఇతర లైన్స్ సభ్యులు పాల్గొన్నారు.