కాంగ్రెసు అభ్యర్థి విజేష్‌రాజ్‌కు బి ఫారం

ప్రజాశక్తి-సంతనూతలపాడు: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి చేతుల మీదుగా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పాలపర్తి విజేష్‌రాజ్‌ బీ ఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా పాలపర్తి విజేష్‌రాజ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ముఖ్యంగా వైఎస్‌ షర్మిలరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్‌ పార్టీ సైనికుడిగా నిజాయతీగా పనిచేస్తానని ఆయన తెలియజేశారు. విజేష్‌రాజ్‌ తండ్రి మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌ రాజుకు, మాజీ కేంద్ర మంత్రి, బాపట్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జేడీ శీలంకు, బాపట్ల జిల్లా డీసీసీ అధ్యక్షులు గంటా అంజిబాబుకు, తనకు దీవెనలు అందించిన కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటు వేసి సంతనూతలపాడు ఎంఎల్‌ఏగా తనను, బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీ శీలంను గెలిపించాలని కోరారు.

➡️