ప్రజాశక్తి-గాజువాక సుందరయ్య వర్థంతిని పురస్కరించుకొని తోకాడ సమైక్య అపార్ట్మెంట్లో సాయి దుర్గ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యాన ఉచిత దంత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 100 మంది వరకు దంత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డెంటల్ సర్జన్ డాక్టర్ సూరిశెట్టి ప్రణరు, సిబ్బంది సేవలందించారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు, కార్యదర్శి తవిటయ్య, శంకరరావు, భాస్కరరావు, సన్యాసయ్య, మణి పాల్గొన్నారు.