అద్దంకిలో ఘంటసాల జయంతి

Dec 4,2023 16:13 #Bapatla District
ghatasala birth anniversary

ప్రజాశక్తి-అద్దంకి : ప్రముఖ సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఘంటసాల గానభరతి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఘంటసాల విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు మోటుపల్లి రామదాసు మాట్లాడుతూ తెలుగు సినీపాటకు ఓ చరిత్రను సృష్టించిన మహాగాయకుడిగా వేల పాటలతో పండితుల నుండి పామరుల దాకా నిత్యం ప్రతి నోట వినిపించి అమృతస్వరం అని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సాహితీ స్రవంతి అధ్యక్షులు చందలూరి నారాయణరావు మాట్లాడుతూ ఘంటసాల గానంలో ప్రతి అక్షరం, ప్రతిపాట గొప్పతనం సంతరించుకుని సంగీతం, స్వరం, శబ్దము ప్రధానంగా సాగిన ఆయన పాటల ప్రహనం అద్వీతీయంగా ఈ శతాబ్ది గాయకుడిగా ఘంటసాల స్వరం ప్రవాహం తెలుగు వారి హృదయాల్లో జీవ నదిగా ప్రహిస్తుంటే ఉంటుందని మరియు ఒక్క భగవద్గీతను ఘంటసాల గొంతులో వినగలడం తెలుగు వారికి భగవంతుని వరప్రసాదం అని అన్నారు. మరో అతిథి అర్.వి.రాఘవరావు మాట్లాడుతూ మూడు వేల పాటలతో , వందల రాగాలతో సంగీతాన్ని రుచి చూపి, తెలుగు సినీ పాటకు అమరత్వాన్ని ప్రసాదించి, చరిత్ర సృష్టించారని అన్నారు. అనంతరం శతాబ్ది గాయకుడు ఘంటసాల అనే పుస్తకాన్ని చందలూరి నారాయణరావు కి అధ్యక్షులు మోటుపల్లి రామదాసు అందచేశారు. తెలుగు పాట చరిత్రను , పలు సినిమాల్లో ఘనత కెక్కిన పాటలను, గాయకులను, సంగీత దర్శకుల్ని పరిచయం చేస్తూ చల్లా సుబ్బారాయుడు వ్రాసిన ఈ గ్రంధాన్ని గురించి పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ బాలు, గోగులమూడి శేషగిరి, బత్తుల అంజయ్య , పాటిబంట్ల శ్రీమన్నారాయణ, షేక్ మస్తాన్ ,కూరపాటి కోటేశ్వరరావు మరియు పలువురు ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు.

➡️