ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : మండల కేంద్రమైన సోమలలోని ప్రభుత్వ కార్యాలయాలు మంగళవారం ఉదయం 11 సమయం దాటుతున్నప్పటికీ మూసివేయబడి ఉన్నాయి. పలు కార్యాలయాలు తెరిచి ఉన్నప్పటికీ ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. వెలుగు కార్యాలయం, హౌసింగ్ కార్యాలయం తాళాలు వేసి ఉన్నాయి. తహశీల్దార్, ఎంపీడీవో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.