పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీన పులివెందుల అసెంబ్లీకి నామినేషన్‌ వేయనున్నారని ఇందుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌ సంబంధిత అధికారం ఆదేశించారు. మంగళవారం భాకరా పురంలో ఉన్న హెలిప్యాడ్‌, సిఎస్‌ఐ చర్చిలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంతాలను అక్కడి నుంచి నామినేషన్‌ వేసే ఆర్‌డిఒ కార్యాలయం తదితర ప్రాంతాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించే ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఆర్‌ఒ వెంకటేశ్వర్లుతో పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో పోలీసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️