ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : ఈనెల 12న హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సింగనమల్ల నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలో ఈనెల 12 రోడ్ షో పర్యటన ఉంటుందని అందులో భాగంగా మంగళవారం మండల కేంద్రమైన నార్పలలో టిడిపి సింగనమల నియోజకవర్గం ఇంచార్జ్ బండారు శ్రావణి, టూ మెన్ కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, కేశవరెడ్డిలు స్థల పరిశీలన చేశారు. ఇందులో భాగంగా సింగనమల బుక్కరాయసముద్రం గార్లదిన్నె మండల కేంద్రంలో కూడా స్థల పరిశీలనలు చేశారు. సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ షో ఎక్కడ నిర్ణయించాలన్నది రేపు ఉదయానికి తెలుస్తుందని తెలిపారు.