ప్రజాశక్తి -రామచంద్రపురం :రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో గల7 పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ 1861 మే ఒకటో తేదీ నుండి మే 31 వరకు అమల్లో ఉంటుందనీ డి.ఎస్.పి డి రామకఅష్ణ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.రామచంద్రపురం , ద్రాక్షారామ, పామర్రు ,మండపేట టౌన్, మండపేట రూరల్ ,అంగర రాయవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 30 అమలులో ఉంటుందని దీని ప్రకారం ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి గా తీసుకోవాలనీ, అనుమతులు లేకుండా మైకులు, సౌండ్ బాక్స్ లు, అంపలిఫైర్ లు వాడరాదనీ, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపైనమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటన లో తెలియ చేశారు.