టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-గిద్దలూరు : మండల పరిధిలోని ముండ్లపాడు గ్రామానికి చెందిన పలువురు టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన ఆరవీటి శ్రీను ఆధ్వర్యంలో టిడిపి కూటమి గిద్దలూరు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. అశోక్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్‌ రెడ్డి వైసిపి పాలనలోఅన్ని వర్గాలు ప్రజలు విసుగు చెందినట్లు తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. టిడిపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సూపర్‌ సిక్స్‌ పథఖాలతో ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అశోక్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం మండల పరిధిలోని కంచిపల్లె ఎస్‌సి కాలనీలో టిడిపి కూటమి గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి మేనిఫెస్టోలోని అంశాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తమ తండ్రి ముత్తుముల అశోక్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️