ఎమ్మెల్యే స్వామి సమక్షంలో టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం మూలగుంట పాడు ఎస్‌టి కాలనీకి చెందిన 30 కుటుంబాల వారు టిడిపి కూటమి కొండపి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో సోమవారం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంటో టిడిపి న్యాయవాదులు సంఘం జిల్లా అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎంపిటిసి కిచ్చేంశెట్టి బసవయ్య, మాజీ వార్డు సభ్యులు వర్మ, నరాల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️