ప్రజాశక్తి – కాకినాడ
స్పందనకు వస్తున్న అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరం లో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు వచ్చి తమ తమ సమస్యలతో కూడిన అర్జీలను అధికారులకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూ రు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 378 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. స్పం దన కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని సంబం దిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలనన్నారు. అర్జీదారుల సమస్య లకు సంబంధించిన ఫోటోలను తప్పనిసరిగా పరిష్కార నివేదికలకు జతపరచాలని ఆమె తెలిపారు. రీ ఓపెన్ అయ్యే అంశాలపై అధికా రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెసి సివి ప్రవీణ్ ఆదిత్య, జడ్పి సిఇఒ ఎ.శ్రీరామచంద్రమూర్తి, ఇన్ ఛార్జ్ డిఆర్ఒ కె.శ్రీరమణి, బిసి కార్పొరేషన్ ఇడి అద్దంకి శ్రీనివాసరావు, డిఎల్డిఒ పి.నారాయణ మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.