సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి

Apr 10,2024 17:00 #Kakinada

ప్రజాశక్తి-ఏలేశ్వరం: మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పైల సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ మేరకు ఇటీవల ఇస్రో శిక్షణకు ఎంపికైన ఏలేశ్వరంకు చెందిన స్పార్క్ ఫౌండేషన్ బృందాన్ని ఆయన బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్రోకు రాష్ట్రం నుండి మొట్టమొదటిసారి ఎంపికైన స్పార్క్ ఫౌండేషన్ బృందం సభ్యుల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ ఎన్ సాయి సందీప్, రీజనల్ కో ఆర్డినేటర్ రవికరణ్, కోఆర్డినేటర్ ఆదిత్య ఉన్నారు.

➡️