ప్రజాశక్తి – ఏలేశ్వరం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన న్యాయ చట్టాల అమలును నిలుపుదల చేయాలని ప్రత్తిపాడు కోర్ట్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బొగతా శివ డిమాండ్ చేశారు. ఆదివారం ప్రత్తిపాడులో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కొత్త న్యాయ చట్టాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ కొత్త చట్టాలలోని పలు నిబంధనలు రాజ్యాంగబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపై పూర్తి అవగాహన కల్పించే వరకు చట్టాలు అమలు నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అవసరాల దేవి, పిల్లా రాజు, బండారు నరసింహ రావు, బత్తిన సింహాచలం, కంద నానాజీ, పాల్గొన్నారు.