పాల్గొన్న సూర్యప్రకాష్, పార్టీ నాయకులు
ప్రజాశక్తి-రామచంద్రపురం
పట్టణం 1వ వార్డు కొత్తూరు ఎస్సి కాలనీ టిడ్కో హౌసింగ్ బోర్డు వద్ద గురువారం గడపగడపకూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, తనయుడు పిల్లి సూర్య ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ ప్రతి నెల అవ్వకు, తాతకు ఇంటి వద్దనే తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం దేశంలోనే వైసిపి ప్రభుత్వం అని ఆయన అన్నారు. గడపగడపకూ.. వెళ్లి సిఎం జగన్ చేస్తున్న అభివద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాబోతున్న ఎన్నికల్లో వైసిపి గెలిపించాలని కోరార.కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాదం శెట్టి శ్రీదేవి శ్రీధర్, వైస్ చైర్పర్సన్ కోలమూరి శివాజీ, గుణ్ణంవెంకటేశ్వరరావు సూరిబాబు, చీకట్ల కాశి బాబు, మల్లవరపు బుజ్జి , పంపన సాయి తదితరులు పాల్గొన్నారు.