ఎన్సిసి విద్యార్థులతో మాట్లాడుతున్న సిఐ దొరరాజు
ప్రజాశక్తి-రామచంద్రపురం
ఎన్సిసి విద్యార్థులంతా కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రామచంద్రపురం సిఐ పి.దొర రాజు, ఎస్ఐ కె.సురేష్బాబు అన్నారు. గురువారం పట్టణంలో విఎస్ఎం కళాశాల ఆవరణలో ఎన్సిసి విద్యార్థులకు వారు దిశా నిర్దేశం చేశారు. సిఐ దొర రాజు మాట్లాడుతూ తల్లి దండ్రులు కష్టపడి చదివిస్తున్నారని విద్యార్థులు కష్టపడి చదువుకొని చెడు వ్యసనాలకు పోకుండా, సత్ప్రవర్తన తో మెలుగుతూ, పుట్టిన గ్రామానికి, చదువు చెప్పిన గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు మంచి ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలవాలని సూచించారు . ఎన్సిసి విద్యార్థులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు వివరించి అభినందించారు.