ద్రాక్షారామలో సావిత్రిబాయి పూలే 127 వర్ధంతి

Mar 10,2024 11:56 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ద్రాక్షారామలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ద్రాక్షారామ మసీద్ సెంటర్ లో గల పూలే దంపతులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాట్ల మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి శ్రామిక మహిళా సాధికారిత అనేది ఆమెతోనే సాధ్యమైందని. తన భర్త పూలే తో కలిసి 1841జనవరి 1న పూణే లో మొదటి మహిళా పాఠశాల ప్రారంభించారని తెలిపారు. సావిత్రిబాయి పూలే త్యాగాలను ప్రభుత్వం గుర్తించి ఆమె జయంతి రోజును జనవరి 3న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, ఆమెకు భారతరత్న బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మగాపు అమ్మిరాజు, కానీల వీరభద్రరావు, కొత్తపల్లి దుర్గా ప్రసాద్, వేమవరపు రాంబాబు, షావుకారు శివయ్య, సూధంశెట్టి గంగాధర్ , కొండేటి రామకృష్ణ, రాజాన గోవింద్, మెడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

➡️