పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు 

Jul 1,2024 16:13 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి 4 వేల రూపాయలతో పాటుగా 3 నెలల బకాయితో కలసి 7 వేల రూపాయలను ఆలమూరులో లబ్దిదారులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ముఖ్య అతిథిగా హాజరై పింఛన్ల పంపిణీ చేశారు. ఆయన వెంట జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు, టిడిపి యువనేత బండారు సంజీవ్, టిడిపి నాయకులు వంటిపల్లి పాపారావు, ఈదల సత్తిబాబు, వంటిపల్లి సతీష్, ఈదల నల్లబాబు, రామానుజుల శేషగిరిరావు, వైట్ల సత్యనారాయణమూర్తి, తదితర తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

➡️