ప్రమాదంలో ఉన్న దేశాన్ని కాపాడుకునేందుకు బిజెపి ఓడించాలి

Mar 27,2024 15:18 #BJP, #Krishna district

ప్రజాశక్తి – చల్లపల్లి : ప్రమాదంలో ఉన్న దేశాన్ని కాపాడుకునేందుకు బిజెపి ఓడించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఓ నరసింహారావు సంయుక్తంగా ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం కార్యకర్తల సానుభూతిపరుల సమావేశం స్థానిక శ్రామిక గుంటూరు బాపనయ్య భవనంలో మండల పార్టీ కార్యదర్శి యద్దనపూడి మధు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల మతాల మధ్య చిచ్చుపెట్టి మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న బిజెపిని  ఓడించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు. అవకాశ రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్న బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడంపై సమాధానం చెప్పాలని టిడిపి శ్రేణులను ప్రశ్నించారు ప్రశ్నించారు. ఉద్యోగ కార్మికుల కర్షకుల అంగన్వాడి సమస్యలపై పోరాటం చేసే పార్టీ సిపిఎం ఒకటే అని అన్నారు. ప్రజా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళిన ఘనత సిపిఎం పార్టీకి దక్కింది అన్నారు. నేడు అధికారం కోసం పోరాడుతున్న పార్టీలు ఎప్పుడైనా ప్రజా ఉద్యమం చేసి జైలుకు వెళ్లారా అని  ప్రశ్నించారు. ఆదాని అంబానీ కోసం కార్పొరేట్ సంస్థల కోసం పరిశ్రమలు తాకట్టు పెడుతున్న బిజెపిని ఓడించేందుకు సిద్ధపడిన వామపక్షాలకు ప్రజల సహకారం అందించాలని కోరారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజల బుద్ధి చెప్పాలి అన్నారు. దేశ బుద్ధుని ప్రజా సంక్షేమాలను, ప్రజా సమస్యలను గాలికి వదిలి అధికారం కోసం ఆరాటపడుతున్న పార్టీల ఉద్దేశ్యాలను ప్రజలు గ్రహించాలని అన్నారు. కష్టజీవుల రాజ్యం రావాలని ఎంతోమంది అమరవీరులు ప్రాణ త్యాగం చేశారని వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త దేశానికి ద్రోహం చేస్తున్న బిజెపిని ఓడించేందుకు కఈషి చేయాలని ఆయన అన్నారు.

➡️