ప్రజాశక్తి-చల్లపల్లి : స్థానిక ఇస్లాం నగరులోని మదరసాలో అరబ్బీ ఖురాన్ చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్న పిల్లలకు మరియు నిర్వాహకులకు ఐదువేల రూపాయలు విలువచేసే నిత్యవసర సరుకులను అవనిగడ్డకు చెందిన శ్రీరామా వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్ కిషోర్ నాయుడు శుక్రవారం అందచేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి పఠాన్ కరీముల్లా ఖాన్, కృష్ణాజిల్లా ముస్లిం చైతన్య వేదిక ఎగ్జిక్యూటివ్ నెంబర్ అబ్దుల్ సత్తార్, మదర్సా వ్యవస్థాపకులు, నిర్వాహకులు మహమ్మద్ ఆరిఫ్, టైలర్ షరీఫ్, మహమ్మద్ ఖాదర్, మదరసా సెక్రటరీ మెకానిక్ ఇలియాజ్, ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ మహబూబ్ పాషా, మహమ్మద్ బహదూర్ పాల్గొన్నారు.