పెనమలూరు టిడిపి అభ్యర్థిగా బోడే ప్రసాద్

Mar 22,2024 11:48 #Krishna district, #TDP, #TDP candidates

ప్రజాశక్తి-కంకిపాడు : పెనమలూరు సీటుపై ఉత్కంఠ వీడింది. టిడిపి అభ్యర్థిగా బోడే ప్రసాద్ ను టిడిపి అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల విడుదల చేసిన తొలి రెండు జాబితాల్లో బోడే ప్రసాద్ కు సీటు దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు, లోకేష్ ఫోటోలతో ప్రచారం కూడా మొదలు పెట్టారు. దీంతో టిడిపి అధిష్టానం దిగిరావాల్సి వచ్చింది. అయినప్పటికీ పెనమలూరు సీటు కోసం అనేక పేర్లు పరిశీలించింది. ఓ దశలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, దేవినేని ఉమా ఇలా రకరాల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరగా బోడే ప్రసాద్ ఆ సీటును దక్కించుకున్నారు. దీంతో సీనియర్ నేత యలమంచిలి కిషోర్ బాబు ఆధ్వర్యంలో బాణా సంచాలు కాల్చి, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు మండల పార్టీ అధ్యక్షుడు సుదిమల్ల రవీంద్ర, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మాజీ జడ్పీటీసీ గొంది శివరామకృష్ణ, సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, ఈడుపగల్లు సర్పంచ్ పందిపాటి ఇందిరతో పాటు బండి నాంచారయ్య, యేనుగ జయ, పచ్చిపాల రాజా, విక్రమ్, బొర్రా వెంకట్, కొలుసు గోవింద్, గుమ్మడి కిరణ్ లు హర్షం వ్యక్తం చేశారు.

➡️