ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : మండలంలోని కవుతరం (మచిలీపట్నం-గుడివాడ) ప్రధాన రహదారి సెంటర్ లో శుక్రవారం తెల్లవారుజామున వ్యాన్ ఢీకొట్టడంతో తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కార్యాలయం తలుపులు మొత్తం ధ్వంసం అయ్యాయి. మధ్యరాత్రి 2 గంటల సమయంలో పెద్ద శబ్దాం రావడంతో బయటకు వచ్చి చూడటానికి భయపడి పార్టీ భవన యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో బయటికి వచ్చి చూడగా పార్టీ కార్యాలయపు తలుపులు పూర్తిగా ధ్వంసం అయ్యి ఉన్నాయి, పోలీసులు ప్రధాన సెంటర్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. పరిశీలనలో వ్యాన్ ఢీకొన్నట్లు గుర్తించి దాని సమాచారాన్ని తీసుకున్నారు. గుడ్లవల్లేరు ఎస్సై గంటా సత్యనారాయణ తన సిబ్బందితో మండలంలోని ఉలవలపూడి గ్రామానికి చెందిన వ్యాన్ గా గుర్తించారు. ఆ వ్యాన్లో నిల్వకూలీలను గుడివాడ తరలించి తిరిగి వస్తుండగా నిద్ర మత్తులో డ్రైవర్ ఈ ప్రమాదం చేసినట్లు గుర్తించామని ఎస్సై తెలిపారు.