యాత్రలో పాల్గొన్న నాయకులు
ప్రజాశక్తి – హోళగుంద
మండలంలోని నెరణికి, నెరణికి తండాల్లో బిజెపి మండల అధ్యక్షులు ఎఇఎన్.ప్రసాద్, ఆధ్వర్యంలో శనివారం ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ నిర్వహించారు. అసెంబ్లీ కన్వీనర్ డిఎం.వెంకటరాముడు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద, మండల సెక్రటరీ విజరు, మండల యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి చిన్న, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి రామలింగ, నెరణికి తండాలో మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు రాజేష్ నాయక్ పాల్గొన్నారు.