పింఛన్ల పంపిణీని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

Jul 1,2024 11:39 #Manyam District, #parvatipuram

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్ : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పర్యవేక్షించారు. సంబంధిత గ్రామ, వార్డులలో సిబ్బంది ఉదయం గం.6.00లకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు. పార్వతీపురం కొత్తవలస గ్రామ సచివాలయం, గరుగుబెల్లి మండలం సంతోష పురం గ్రామం లోని పింఛన్లను సోమవారం పంపిణీ ని జిల్లా కలెక్టర్  పరిశీలించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివిధ రకాల సామాజిక పింఛన్లను అందజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశ పత్రాన్ని అందజేశారు. పెన్షన్ల స్లిప్పులు అందజేస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది సతశాతం పింఛన్ల పంపిణీ సాయంత్రానికి జరగాలని ఆదేశించారు. ఉదయం గం.8.00 లకు 25 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అయిందని తెలిపారు.

➡️