నేడు బనగానపల్లెలో ప్రజాగళం యాత్ర

Mar 28,2024 21:43

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి

నేడు బనగానపల్లెలో ప్రజాగళం యాత్ర
– టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాక
-విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే
ప్రజాశక్తి – బనగానపల్లె
నేడు బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్‌ బంకు కూడలిలో జరిగే ప్రజాగళం యాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో బీసీ జనార్దన్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసిపి రాక్షస పాలనకు సమర గీతం పాడేందుకు తలపెట్టిన ప్రజాగళం యాత్రను విజయవంతం చేయాలని కోరారు. నేడు పట్టణంలోని పెట్రోల్‌ బంకు కూడలిలో ఉదయం 11 గంటలకు జరిగే ప్రజాగళం బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.చంద్రబాబు పర్యటన వివరాలుటిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుండి హెలికాప్టర్‌లో బనగానపల్లెకు 10:30 గంటలకు బేతంచర్ల రోడ్డులోని కాట్రెడ్డి లేఅవుట్‌ వద్దకు చేరుకుంటారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అక్కడ టిడిపి నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారని చెప్పారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో పెట్రోల్‌ బంకు కూడలిలో జరిగే బహిరంగ సభకు రానున్నట్లు తెలిపారు 10:30 నుండి 12:30 వరకు సమావేశం జరగనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12:40 నుండి పట్టణంలో మధ్యాహ్న భోజన విరామం అనంతరం 1:45కు హెలిప్యాడ్‌కు చేరుకుంటారని, 1:50కి నెల్లూరు జిల్లా కావలికి బయలుదేరి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

➡️