తడి-పొడి చెత్త తరలించే వాహన డ్రైవర్లు ధర్నా

May 18,2024 16:18 #ntr district

ప్రతి నెల సమయానికి జీతాలు చెల్లించాలని డిమాండ్
18,500కు జీతం పెంచాలని డిమాండ్
ఎలక్షన్ ముందు అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి డిమాండ్
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో
తడి పొడి చెత్తను తరలించే డ్రైవర్ల వాహనదారుల పరిస్థితి దారుణంగా ఉందని సిఐటియు నాయకులు సింగ్ నగర్ వాంబే కాలనీ డంపింగ్ యార్డ్ దగ్గర క్యాబ్ వాహనదారుల డ్రైవర్లు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ అధికారులు డ్రైవర్లకు జీతాలు పెంచుతామని మాట ఇచ్చారని కానీ ఇప్పటివరకు ఎలాంటి జీతాలు పెంచకపోగా ఇస్తున్న జీతాలు కూడా ఇవ్వటం లేదని కుటుంబాలు నడవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని కరెంటు బిల్లు ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నామని జీతాలు రాకపోతే మేము ఎలాగా బ్రతకాలని ప్రతి నెల మొదటి వారంలో జీతాలు వెంటనే ఇవ్వాలని అదేవిధంగా వాహనాలు రిపేర్లు విపరీతంగా వస్తున్నాయని వాటి ఖర్చు డ్రైవర్ల భరించాలని చెప్పటం దారుణం అన్నారు. ఇంటి అద్దె కట్టడానికే డబ్బులు లేకపోతే వాహన రిపేర్లు ఎలా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన మాట ప్రకారం 18 ,500 వేతనం ఇవ్వాలని అదేవిధంగా కార్మికులకు ఈఎస్ఐ పీఎఫ్ తదితర పథకాలు వెంటనే వచ్చే విధంగా ప్రభుత్వం కల్పించాలని గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్న గాని అధికారులు పట్టించుకోవడంలేదని మా డిమాండ్లు పరిష్కరించకపోతే నగరం మొత్తం సమ్మె చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో క్యాబ్ డ్రైవర్లు సిఐటియు నాయకులు నగర కోశాధికారి డి స్టీఫెన్ బాబు, నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి టి ప్రవీణ్, డ్రైవర్లు కిరణ్, శివ, రవి, నజీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

➡️