పోలింగ్ బూత్ లను పరిశీలించిన సిఐ భాస్కర్

Mar 20,2024 13:17 #palnadu district

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట 2వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గల పోలింగ్ బూతులను 2వ పట్టణ సిఐ ఆవుల భాస్కర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాశక్తితో ప్రత్యేకంగా సిఐ మాట్లాడుతూ ఇప్పటికే ఒక విడత తమ పరిధిలో ఉన్న పోలింగ్ బూతులను పరిశీలించడం జరిగిందని తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలని బి.ఎల్.ఓ లకు సూచించడం జరిగిందన్నారు. తాజాగా బుధవారం నుండి 2వ విడతగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. కార్యక్రమంలో బి.ఎల్.ఓ లు మహిళా పోలీసులు పాల్గొన్నారు.

➡️