ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ డైట్లో ఏర్పాటుచేసిన 5 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. నియోజక వర్గం పరిధిలో ఉన్న పోలీసులు, ఆర్డిఒ, తహసీల్దార్ కార్యాలయాల ఉద్యోగులు, సిబ్బంది 1174 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఎంత మంది ఓటు హక్కు వినియోగించుకున్నారనేది తెలియాల్సి ఉంది.
![postal ballot poling](https://prajasakti.com/wp-content/uploads/2024/05/1-Postal-Ballot.jpg)