దగా వద్దు… మెగా డీఎస్సీ కావాలి

Feb 5,2024 16:49 #Prakasam District
dyfi protest on dsc

ప్రజాశక్తి-కనిగిరి : మెగా డీఎస్సీ ద్వారా 25వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ కనిగిరి కమిటీ కార్యదర్శి అధ్యక్షతన కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనం నుంచి నిరుద్యోగులు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. పామూరు బస్టాండు సెంటర్ లో మానవహారం నిర్వహించగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా చేయడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో డివైఎఫ్ఐ నాయకులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ధర్నా వద్దకు వచ్చిన ఆర్డీవో ఆర్డిఓ జాన్ ఇర్విన్ కు వినతి పత్రం అందజేశారు . ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగుల సమస్యలను నివేదిక రూపం ద్వారా పంపించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ అంటు నిరుద్యోగులను నిరంతరం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో 1.88లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1. 69లక్షలు మాత్రమే ఉన్నారని దాదాపు 18,520 ఖాళీగా ఉన్నాయని ఇవే కాక ఈనెల చివరి నాటికి మరో 5వేలమంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నరని తెలిపారు. కేంద్రం చేబుతున్న లెక్కలు ప్రకారం 40వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117జీవో పేరుతో మరో 10వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. తెలుగు మిడియం తీసివేసి 15వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిన ఘనత జగన్మోహనరెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. జగనన్న ప్రభుత్వంలో 2వేల పాఠశాలలు మూసివేసిందని ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాద్యాయ పాఠశాలలు 9వేలు ఉన్నాయని ఇప్పుడు ప్రభుత్వం ఖాళీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె ఎఫ్ బాబు, అధ్యక్షులు కె వి పిచ్చయ్య , సిఐటియు జిల్లా కార్యదర్శి పీసీ కేశవరావులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాపౌట్ కావడం లేదా ప్రైవేటు స్కూళ్లలో జాయిన్ అవ్వడం జరుగుతుందని దాదాపు రెండేళ్లలో 6లక్షల మంది విద్యార్థులు ఇలా డ్రాపౌట్ అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించాలని దీక్షలు అనంతరం ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు నారాయణ, శ్రీను, మహమ్మద్ డీఎస్సీ అభ్యర్దులు కళ్యాణ్, రవి, జాస్మిని తదితరులు పాల్గొన్నారు.

➡️