రాంబాబు కోడలు అనూష ప్రచారం

ప్రజాశక్తి – పొదిలి
మే 13న జరుగనున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మార్కాపురం నియోజకర్గ వైసిపి అభ్యర్థి అన్నా రాంబాబు కోడలు అనూష బుదవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని కాలేజీ రోడ్డులో 1, 2, 3వ లైన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంఎల్‌ఎ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మరిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్‌కె మస్తాన్‌వలి, నగర పంచాయతీ అధ్యక్షురాలు ఎస్‌కె నూర్జహాన్ బేగం, వైసిపి మహిళా నాయకులు దోర్నాల వరలక్ష్మమ్మ పాల్గొన్నారు.

➡️