నిస్వార్ధంగా సేవ చేసే వారికే ఓట్లేయండి

May 10,2024 14:13 #kunda
  • ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇండిపెండెంట్‌ అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్
    మార్కాపురం : నిరంతరం ప్రజలకు ఎవరు అందుబాటులో ఉండారో గుర్తెరిగి, సేవాభావంతో సేవ చేసే వారికే ఓట్లేయాలని ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇండిపెండెంట్‌ అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. గత కొన్నిరోజులుగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు, కొండేపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తాను నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజానీకం నుంచి విశేష స్పందన లభించిందన్నారు. తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలంతా ఆదరించారన్నారు. కుండ గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అవినీతి, బంధుప్రీతి, స్వార్థరాజకీయాలను ప్రక్షాళన చేయాలనే సదాశయంతో తాను ఎన్నికల బరిలోకి దిగానన్నారు. ఓటర్లు మంచి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే వారు నిస్వార్ధంగా సేవలందిస్తారన్నారు. డబ్బున్న వారిని ఎన్నికల్లో గెలిపిస్తే వారు మరింతగా ధనవంతులవుతారన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారిలో ఒకరిగా మెలుగుతూ ఉండేవారిని ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని కోరారు. ప్రస్తుతం డబ్బు రాజకీయాలు నడుస్తుండటం బాధ కల్గిస్తోందన్నారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే సదుద్ధేశ్యంతో ఈ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నానన్నారు. గిద్దలూరు ప్రాంత వాసిగా ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ప్రజానీకానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నానన్నారు. నేస్తం ఫౌండేషన్‌ స్థాపించి ఎంతో మందికి సేవలు చేశానని వివరించారు. తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూఐ వారి సమస్యలపై పోరాటాలు చేస్తానన్నారు. డబ్బులకు ఓటర్లు అమ్ముడు పోతున్నారనే అపోహను తనను గెలిపించటం ద్వారా నిరూపించాలని కోరారు. ఇవిఎం యంత్రంపై సీరియల్‌ నం.20పైన కుండ గుర్తుపై ఓట్లేసి తనను గెలిపించాలని జె.వి.మోహన్‌గౌడ్‌ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరికీ విజ్ఞప్తిచేశారు.
➡️