నేడు కడపలో రాహుల్ గాంధీ బహిరంగ సభ

ప్రజాశక్తి – కడప/ వేంపల్లె ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్‌ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, ఎంపీ రాహుల్‌ గాంధీ కడపలో పర్య టించనున్నారు. ఉదయం 11:30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుం టారు. అక్కడి నుంచి ఉదయం 11:45 గంటలకు హెలికాప్టర్‌లో పిసిసి అధ్యక్షులు షర్మిలతో కలసి ఇడుపులపాయకు బయలు దేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకుని రాజశేఖర్‌రెడ్డి సమాధికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం 12:25 గంటలకు తిరిగి హెలి కాప్టర్‌లో బయలుదేరి 12:40 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్‌ షోగా బయలుదేరి బిల్డప్‌ వద్దగల పుత్త ఎస్టేట్‌ ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:00 గంట నుండి 1:45 గంటల వరకు ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు రాహుల్‌ గాంధీ కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి 2:15 గంటలకు బయలుదేరి వెళ్తారు.

➡️