ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో …. మండలంలోని జన్నాడ వద్ద 216 (ఏ) జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా, అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీను నాయక్, స్టాటిక్ సర్వ్యులేషన్ టీం ఇంచార్జ్ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం … రాజానగరం నుండి అమలాపురం వైపుగా ఏపీ 39 ఎల్ క్యూ 2772 నెంబరు ఉన్న కారులో 15,600 రూపాయల విలువ ఉన్న 180 ఎంల్ సామర్థ్యంతో ఉన్న 104 బాటిల్స్ ను తరలిస్తుండగా స్వాధీనపరుచుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే చట్టం దఅష్టిలో అందరూ సమానులేనని, ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు వంటి తదితర ప్రలోభాలకు సంబంధించిన వస్తువులను సరైన ఆధారాలు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సూర్యచంద్రరావు, సిఐఎస్ఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గన్నారు.