చిరు ధాన్యాలు ఆహారం ఆరోగ్య కరం

Feb 12,2024 18:15 #vijayanagaram
  • గిరిజన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టమణీ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం లో సోమవారం చిరుధాన్యాలు – చిరు ధాన్యాల పెంపకం పై రైతులకు, వారి వినియోగం పై ఎంట్రర్ ప్రెన్యూర్స్ కు మరియు వినియోగదారులకు అవగాహ ‘ అంశం పై జరిగిన ఒక్క రోజువర్క్ షాప్ కార్యక్రమములో టి.వి. కట్టిమని వైస్ ఛాన్సలర్ మాట్లడుతూ చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవడము వలన మనకు ఆరోగ్యంగా ఉంటుందని, చిరు ధాన్యలు ఆహారం అలవాటుగా చేసుకోవాలని తద్వారా జీవన విధానం తక్కువ ఖర్చు తో మెరుగుపడుతు చిరుధాన్యాల ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రోత్సాహం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమములో కె . జానకి రావు డివిజనల్ ఫారెస్ట్ అధికారి (సామజిక అడవులు) మాట్లడుతూ బయో డైవర్సిటీ తద్వారా గల ప్రయోజనాలు మిల్లెట్ యోగాలను వివరించారు. శ్రీమతి సరస్వత సీ ఈ ఓ ఆరోగ్య మిల్లెట్, మల్లువలస, మాట్లడుతూ మిల్లెట్స్ ను ఆహారం వివిధ పద్దతులలో తయారు చేసుకొని ఉపయోగించ వచ్చునని అందువలన వీటి వినియోగం పెంచవచ్చునని తద్వారా ఆరోగ్యం జీవన విధానం అలవాటు అవుతుందని అన్నారు. కే. జోగినాయుడు, సెక్రటరీ, ఫర్ మిల్లెట్ సిస్టర్స్ ఎఫ్ పి ఓ మాట్లడుతూ.. వివిధ రకాల మిల్లెట్స్ వారి లభ్యత మరియు వాటి ఉపయోగాలను తెలియజేసారు డి.వి. కృష్ణరెడ్డి, ఆరోగ్యం వ్యవస్థాపకులు మాట్లడుతూ మిల్లెట్స్ ను ఏవిధంగా అవినియోగించాలి, మిల్లెట్స్ వినియోగం వలన కలుగు వివిధ ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కార్యక్రమములో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, అన్ని విభాగాల డీన్స్ , మరియు టీచింగ్, నాన్ -టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️