అవార్డు అందుకుంటున్న జోగినాయుడు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ సదస్సు ఆదివారం విజయనగరం జెడ్పి సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సదస్సుకు వాకర్స్ గవర్నర్ కె.సత్యం అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ఉత్తమ సామాజిక సేవలకు గాను శ్రీకాకుళం నగరంలోని స్టార్ వాకర్స్ క్లబ్ ఉత్తమ క్లబ్గా ఎంపికైంది. ఓవరాల్ ఛాంపియన్ షిప్ అవార్డ్ కూడా దక్కించుకుంది. దీంతో పాటు ఉత్తమ సేవలు అందించే వాకర్ క్లబ్ల్లో నగరానికి చెందిన మారుతీ వాకర్స్ క్లబ్, ఆదిత్య వాకర్స్ క్లబ్, సూర్య వాకర్స్ క్లబ్స్లకు పలు అవార్డులు దక్కాయి. సెమినార్లో ఈ అవార్డులను వాకర్సు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సదస్సుకు శ్రీకాకుళం నుంచి వాకర్స్ ప్రతినిధులు కూన వెంకటరమణ మూర్తి, పి.జి.గుప్తా, గుడ్ల సత్యనారాయణ, శాశపు జోగినాయుడు, ఎస్.సంజీవరావు, కొంక్యాన మురళీధర్, బి.దేవీప్రసాద్, సురేష్ పండా, సింహాద్రి వేణుగోపాల్ పాల్గొన్నారు.