మాట్లాడుతున్న జెడ్పి చైర్పర్సన్ విజయ
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు కేటాయించిన 19 మంది ఎంపిడిఒలకు పలు మండలాల్లో పోస్టింగ్లు కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఇద్దరు, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 17 మందిని జిల్లాకు కేటాయించారు. బదిలీపై వచ్చిన ఎంపిడిఒలకు స్థానాలు కేటాయిస్తూ జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్.వెంకట్రామన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ఎంపిడిఒలకు జెడ్పి చైర్పర్సన్ పిరియా విజయ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పేరు మండలం
కె.వెంకన్నబాబు పాతపట్నం
కె.ఎస్ కొండలరావు పలాస
ఎం.రత్నం సరుబుజ్జిలి
డి.స్వరూపారాణి హిరమండలం
బి.కళ్యాణి గార
వై.పద్మజ కోటబొమ్మాళి
సిహెచ్.సూర్యనారాయణ పొందూరు
వై.వి రాజేంద్ర ప్రసాద్ ఇచ్ఛాపురం
ఎం.సతీష్ శ్రీకాకుళంపి.త్రివిక్రమరావు
కొత్తూరుకె.విజయలక్ష్మి టెక్కలి
జి.గిరిబాల ఎల్.ఎన్ పేట
కె.రామకృష్ణరాజు జి.సిగడాం
జి.భాస్కరరావు లావేరు
ఎం.వి.బి సుబ్రమణ్యం వంగర (విజయనగరం)
ఎస్.రామకృష్ణ సంతకవిటి (విజయనగరం)
కె.సాల్మన్ రాజు వీరఘట్టం
(మన్యం)కె.కిషోర్ కుమార్ భామిని (మన్యం)
జి.పైడితల్లి పాలకొండ (మన్యం)