జ్ఞాపికను స్వీకరిస్తున్న ఆకాష్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
వర్థమాన సినీ హీరో, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ తనయుడు పూరి ఆకాష్ ఆదివారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారి సేవల్లో పాల్గొన్న ఆయనకు స్వామివారి శేష వస్త్రాలు కప్పి పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి జ్ఞాపికను అందజేశారు. ఆయనతో పాటు ఆలయ ఇఒ చంద్రశేఖర్, సీనియర్ సహాయకులు కృష్ణ్ణమాచార్యులు పాల్గొన్నారు.