12 నుంచి టెక్ని వెర్స్‌ ఫెస్ట్‌

ఈనెల 12 నుంచి 14వ తేదీ

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ బాలాజీ

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు స్థానిక ట్రిపుల్‌ ఐటిలో శ్రీకాకుళం, విజయనగరంలోని పలు కళాశాలల విద్యార్థులతో టెక్ని వెర్స్‌ టెక్నికల్‌ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ కె.వి.జి.డి బాలాజీ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఛాంబరులో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫెస్ట్‌లో ఇవి వెహికల్స్‌, డ్రోన్‌ సర్వేయింగ్‌, ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో, ఫోన్‌ ఫార్జ్‌, టెక్‌ అరేనా, టెక్‌ ఫేట్‌, వెబ్‌ డిజైన్‌ తోన్‌, కన్సలే హాక్‌, కాగానితో కోడ్‌, అన్వేషక, మైండ్‌ టెంటాకల్స్‌, ఎలక్ట్రిక్కింగ్‌, సర్క్యూరిటీరి, స్పార్క్‌ యువర్‌ బ్రెయిన్‌, డిజైన్‌ డేర్బైతో ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. కాకుండా, విజ్ఞాన ప్రదర్శన, వినోద ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానం, వినోదం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫెస్ట్‌లో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఒఎస్‌డి సుధాకర్‌ బాబు, పరిపాలనా ధికారి ముని రామకృష్ణ, డీన్‌ మోహన్‌కృష్ణ, చౌదరి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ అసిరినాయుడు, వెల్ఫేర్‌ డీన్‌ రవి, ఫెస్ట్‌ కన్వీనర్‌ వాసు, కో కన్వీనర్‌ దిలీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️