- క్లీనర్ దుర్మరణం
- 20 మంది విద్యార్థులకు గాయాలు
ప్రజాశక్తి-కావలి : స్కూల్ బస్సును మినీలారీ ఢ కొద్ది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ దుర్మరణం చెందారు. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కావలిమండలం ముసునూరు టోల్ప్లాజా వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. ముసునూరు టోల్ప్లాజా వద్దను ఆర్ఎస్ఆర్ పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సు గౌరవరం నుంచి స్కూల్కి బయలుదేరింది. బస్సు టోల్ప్లాజా వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి మినీ లారీ ఢకొీంది. దీంతో బస్సు గేట్లో ఉన్న క్లీనర్ దేవరాల చినకొండయ్య (35) అక్కడిక్కడే మృతి చెందారు. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లీనర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరామర్శించారు. మృతుని కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ఆమె ప్రకటించారు.