ఉమ్మడి పార్టీల గెలుపు ప్రజా విజయం : టిడిపి నేత మెర్ల గోపాలస్వామి

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల్లో కొత్తపేట ఉమ్మడి టిడిపి శాసనసభ్యునిగా బండారు సత్యానందరావును అఖండ మెజారిటీతో గెలిపించిన విధానాన్ని టిడిపి మండల అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి ప్రజా విజయంగా పేర్కొన్నారు. మండలంలోని చొప్పెల్ల ప్రజానీకాన్నీ అభినందిస్తూ … టిడిపి మండల అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి ఆధ్వర్యంలో విజయోత్సవ పాదయాత్ర ఈరోజున భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా మెర్లను అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. అనంతరం బాణాసంచాతో గ్రామంలో విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ ఆధ్యంతం ఆనందోత్సవాల మధ్య నడిచింది. ఈ సందర్భంగా మెర్ల మాట్లాడుతూ … ప్రజా ప్రతినిధుల గెలుపులో ఓటరుపాత్ర ఈసారి అమోఘం అన్నారు. ఉమ్మడి పార్టీ గెలుపు ప్రజా విజయంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నేతలు సఖుమల్ల రాముడు, ఆకుల రామకఅష్ణ, మద్ది పట్టాభి, జాంపోలు వెంకట్రావు, ఆకుల అన్నవరం, బల్ల హరి, కొత్తపల్లి రాంబాబు, సుంకర కామరాజు, అనుసూరి ఆంజనేయులు, వెత్స సుబ్బారావు, కొత్తపల్లి కృష్ణ, ఆకుల రాజు, సోము రాంబాబు, గుండుమల్ల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️