తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవంప్రజాశక్తి- తిరుమల: తిరుమల శ్రీవారి పార్వేట ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీకష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపంలో పుణ్యాహం, ఆరాధన, నివేదనం జరిగి హారతులు జరిగాయి. అనంతరం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి. శ్రీ కష్టస్వామి వారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరం పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణం వేసి వెనుకకు వచ్చారు. ఇలా మూడుసార్లు జరిగింది. శ్రీమలయప్ప స్వామివారు ఉత్సవం పూర్తయి మహాద్వారంకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తంను తీసుకొని సన్నిధిలోనికి వేంచేశారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది. టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్‌ఇ -2 జగదీశ్వర్‌ రెడ్డి, లోకనాథం, ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు.

➡️