తిరుమలలో వేడుకగా చక్రస్నానం

తిరుమలలో వేడుకగా చక్రస్నానం

తిరుమలలో వేడుకగా చక్రస్నానంప్రజాశక్తి- తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారు జామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం గర్భాలయం నుండి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చి పల్లకిలో మాడవీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా వారహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాని నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల నడుమ శుభముహుర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని మూడుసార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది. వందలాది భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️