వ్యక్తిత్వ వికాసంపై అవగాహనప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఃవ్యక్తిత్వ వికాసం-ఉపాధి అవకాశాలుఃః అనే అంశంపై మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ మేనేజరు మోహన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మంచి అలవాట్లను అలవరచుకోవడం ద్వారా ఉత్తమ ప్రయోజకులు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టరు జి. శ్రీనివాసులు రెడ్డి, ప్రముఖ.వ్యక్తిత్వ వికాస నిపుణులు నివేదితారెడ్డి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగ అధ్యక్షురాలు ఎ దేవకి, అధ్యాపకులు లక్ష్మీబాయి, డాక్టరు తిరుమలయ్య, జ్యోతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
![వ్యక్తిత్వ వికాసంపై అవగాహనప్రజాశక్తి - పుత్తూరు టౌన్ :](https://prajasakti.com/wp-content/uploads/2023/12/666666666666666666666666666.jpg)